జనసేన కార్యాలయ సిబ్బందిపై దాడులు హేయమైన చర్య

  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి

ధర్మవరం: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ గురువారం రాత్రి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బస చేసే అపార్ట్మెంట్ పై పోలీసులు కారణాలు చెప్పకుండా సోదాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, కేవలం ఓటమిభయంతోనే జగన్ రెడ్డి పోలీసులతో ఈ విధమైన దాడులు చేయించడం హేయమైన చర్యని పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటాడని వచ్చేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం కచ్చితంగా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.