డిజిటల్ క్యాంపెయిన్ లో అవనిగడ్డ జనసేన

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ – కొత్తపేట, మోదుమూడి – పెద్దగుడుమోటు రోడ్లను తక్షణమే నిర్మించాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ టాగ్ డిజిటల్ కాంపెయిన్ కార్యక్రమం అవనిగడ్డ మండలం మోదుమూడి, కొత్తపేట గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్ల సమస్యపై గత సంవత్సరం జనసేన నిర్వహించిన డిజిటల్ కాంపెయిన్ చూసి 2022జులై 15 నాటికి రాష్ట్రంలో గోతులు లేని రోడ్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ సవాల్ చేశారని, ఇప్పుడు గ్రామాల్లో ఎటు చూసినా రోడ్ల దుస్థితి అలాగే కొనసాగుతోందన్నారు. గుడివాక శేషుబాబు మాట్లాడుతూ చేతకాని అవనిగడ్డ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల కారణంగానే అవనిగడ్డ నియోజకవర్గమునకు రోడ్లకు నిధులు రావట్లేదని అన్నారు. ప్రపంచంలో ఎనిమిదో వింతగా అవనిగడ్డ నియోజకవర్గంలో నీరు వదిలాక కాలువల మరమ్మత్తులు, వర్షాలు పడ్డాక డ్రైనేజీలు బాగు చేస్తారని తెలిపారు. ఇకనైనా అవనిగడ్డ ఎమ్మెల్యే నిద్రలేవాలని కోరారు. అవనిగడ్డ ఎంపీటీసీ భాను, పార్టీ నాయకులు పాల్గొన్నారు.