29వ సారి రక్తదానం చేసిన బైరి వంశీ కృష్ణ

హనుమకొండ న్యూస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి బైరి వంశీ కృష్ణ శనివారం హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో 29వ సారి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ఆపత్కాలంలో మనిషికి రక్తం సంజీవిని లాంటిదని తెలియజేసారు.