పేద కుటుంబానికి అండగా నూతక్కి జనసేన గ్రామ కమిటీ

మంగళగిరి మండలం, నూతక్కి గ్రామ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న జనసేన పార్టీ సానుభూతి పరుడైన షేక్ కరిముల్లా కుటుంబ పోషణ కొరకు తోపుడు బండిని మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు చేతుల మీదుగా బుధవారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల కమిటీ సభ్యులు, నూతక్కి గ్రామ కమిటీ అధ్యక్షులు మారెళ్ళ చైతన్య రమేష్ మరియు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.