బాణాపురం అమ్మవారి అన్నసమారాధనలో పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐ పోలవరం మండలం బాణాపురం అమ్మవారి అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు, సలాది రాజా, మురముళ్ళ గ్రామ కమిటీ కన్వీనర్ గంజా యేసు, ఐ పోలవరం గ్రామ కమిటీ కన్వీనర్ దేవు రాంబాబు, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.