క్రియాశీలక సభ్యునికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

రాజమండ్రి సిటీ, స్థానిక 9వ వార్డు క్రియాశీలక కార్యకర్త గీసాల శంకర్ గత వారం పెయింటింగ్ వేస్తూ ప్రమాదావశాత్తు పడిపోవడం వలన కాలు ఫ్రాక్చర్ అయ్యినది. ఈ సమస్యను వార్డు జనసేన నాయకులు చౌకొండ మురళి సిటీ ఇంచార్జ్, అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లాగా వెంటనే స్పందించి ఆయనను జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ పరామర్శించి యోగక్షేమాలను కనుక్కొని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి కార్పొరేషన్ ఉపాధ్యక్షులు దాసరి గురునాధం రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి ప్రకాష్ నగర జనసేన నాయకులు రవికుమార్ గౌడ్, వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు.