తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన బత్తుల

రాజమండ్రి: జనసేన పార్టీ స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు నిస్వార్థంగా పని చేస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అనుచరులలో ఒకరుగా ఇటీవలే పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు అందుకున్న టీ టైం అధినేత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని శుక్రవారం రాజమండ్రి షెల్టన్ హోటల్ నందు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.