శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, రాజానగరం మండలం, తూర్పుగోనగూడెం గ్రామంలో శోభయమానంగా జరిగిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గల్లా రంగా, అడబాల బాబీ, నారపల్లి శ్రీధర్, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.