పలు కుటుంబాలకు బత్తుల పరామర్శ

  • యర్రంశెట్టి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం: జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి శ్రీను మావయ్య స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామం వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు కొత్తపల్లి రఘు, మద్దిరెడ్డి బాబులు, చిట్టిప్రోలు సత్తిబాబు, నాతిపం దొరబాబు, వేగిశెట్టి రాజు, మోటుపల్లి మణికంఠ, యర్రంశెట్టి పోలరావు, దేవన దుర్గా ప్రసాద్, నరాల గంగాధర్, సంగుల తమ్మరావు, జనసైనికులు పాల్గొన్నారు.

  • తోరాటి అనంతలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో తోరాటి అనంతలక్ష్మి గుండెపోటుతో మరణించారు. విషయం స్థానిక జనసైనికులు ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో- ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరామ్, మద్దిరెడ్డి బాబులు, చిట్టిప్రోలు సత్తిబాబు, నాతిపం దొరబాబు, వేగిశెట్టి రాజు, మోటుపల్లి శ్రీ మణికంఠ, యర్రంశెట్టి పోలరావు, దేవన దుర్గా ప్రసాద్, నరాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.