వినాయక అన్నసమారాధనలో పాల్గొన్న బత్తుల

రాజానగరం మండలం, కానవరం గ్రామంలో ఘనంగా జరిగిన వినాయక అన్నసమారాధన కార్యక్రమంలో స్వామి వారిని దర్శించి అనంతరం భారీగా ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. వీరి వెంట జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, చిట్టిప్రోలు సత్తిబాబు, నరేంద్రపురం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.