ఘనంగా దాసరి జ్యోతిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు

విశాఖ జిల్లా జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు దాసరి జ్యోతిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన పిఏసి సభ్యులు, గాజువాక ఇంఛార్జ్ కోన తాతారావు ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జ్యోతి రెడ్డిని ఉద్దేశించి తన లాంటి నిబద్ధత కలిగి, ఎంతో విదెయతతో పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్న వారు అవసరమని తెలిపారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా పార్టి వెంట కష్టపడి నడుస్తున్నందుకు అభినందించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టి బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి నిదర్శనం అక్టోబరు 16వ తేదీన పవన్ కళ్యాణ్ గారిని, పార్టీ నాయకులను అక్రమ అరెస్టులను చేసినప్పుడు ఎంతో దైర్యంగా ముందు ఉండి నిలబడ్డారు. జ్యోతి రెడ్డికి జనసేన పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి చోడవరం జనసెన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్ రాజు, అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందు రెడ్డి, గాజువాక నాయకులు తిప్పల రమణ రెడ్డి, గాజువాక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోన చిన అప్పారావు, వార్డ్ ఇన్చార్జిలు రౌతు గోవిందు, 75 వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి కోన పద్మ, కాదా శ్రీను, విందులు వెంకటరమణ, అంజూర్ దీపక్, కరణం కనకర, జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి ముసలయ్య, పెదగంట్యాడ మండలం బిజెపి అధ్యక్షులు కిల్లాని ముసలయ్య, ఐ.ఎన్.టి.సి నాయకులు కోరిబిల్లి అప్పారావు, విందుల సిరాజు, కంకల మురళి దేవిచైతన్య, భాస్కర్ రావు, నేలపు శ్రీనివాస్ రెడ్డి, నీలాపు అప్పల ఎరిపిల్లి నూకరాజురెడ్డి, నామాల అర్జున్, కోన అప్పారావు, కోన రమణ, కోన సంటి, వీరు బాబు, గొంపా అప్పలరాజు, వీర మహిళలు కొల్లూరు రూప, మహాలక్ష్మి, శంకరమ్మ, సాయి, వెంకట లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.