బిహార్‌లో పడవ ప్రమాదం

బిహార్‌లోని భగల్‌పుర్‌ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో వందమంది బోటులో ప్రయాణిస్తున్నారు. బోటు.. ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన స్థానికులు తక్షణమే స్పందించారు. ప్రమాదం నుండి  30 మంది సురక్షితంగా బయటపడగా.. మిగిలినవారి ఆచూకీ లభ్యం కాలేదు. రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. బోటు ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రజలు భారీసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.