అవధూత వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలంలోని గొలగమూడి క్షేత్రం నందు వెలసి ఉన్న అవధూత భగవాన్ వెంకయ్య స్వామి 41వ ఆరాధన మహోత్సవం సందర్భంగా కొట్టిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు 108 కొబ్బరికాయల సమర్పణ జరిపారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని 108 కొబ్బరికాయలు కొట్టి స్వామి ఆశీస్సులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని అవధూత భగవాన్ వెంకయ్య స్వామి కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా, పవన్ కళ్యాణ్ యువత సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు సుమన్, సీనయ్య, దినేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.