డిజిటల్ క్యాంపెయిన్ లో బొబ్బిలి జనసేన

బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కేంద్రంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మహంతి ధనుంజయ అన్నారు. ఈ సందర్బంగా జనసైనికులు సాలూరు రామభద్రపురం సెంటర్లో నిరసన తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా రోడ్డుపై గుంతలు ఫోటోలు తీసి సీఎంని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు. కార్యక్రమం లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మహంతి ధనుంజయ కోరారు. ఈ కార్యక్రమంలో ముళ్ళు గణపతి, ముల్లి వెంకటనాయుడు, పప్పల అప్పలనాయుడు, ముళ్ళు కిషోర్, యాళ్ల మణి, బెల్లన సాయి మరియు మండల జనసైనికులు పాల్గొన్నారు.