యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువతని ఒక ఓట్ బ్యాంక్ గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అని అన్నారు. ఈ మూడున్నర సంవత్సరంలో ఒక్క ఉద్యోగం కూడా యువతకి కల్పించిన సందర్భం కనిపించలేదు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రి మరియు బస్ స్టేషన్ ఓపెనింగ్స్ కనీసం ఎలా ఉన్నాయి అని కంటితో చూడకుండా బటన్ నొక్కి వాటిని ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన డాక్టర్లు లేరు అని మండిపడ్డారు. అర్హులైన వారికి కూడా అన్యాయంగా పించన్ లు తీసేసారు అని మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, నిప్పులేటి తారకరామారావు, వనమాల శ్రీను, తోట అరుణ, అంబటి అరుణ, బొమ్మిడి కృష్ణ కుమారి, సముద్రాల సత్యవాణి, గణేశ్న శ్రీరామ్, పసుపులేటి అభి తదితరులు పాల్గొన్నారు.