పుణ్యక్షేత్రం గ్రామంలో “జనం కోసం జనసేన”, “మహాపాదయాత్ర”

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితపై జనసేన ప్రజా సంతకం ఖచ్చితంగా ఉండబోతుంది “బత్తుల”
  • జనసేన వీరుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి వైసీపీ వారికి రుచి చూపిస్తాం
  • జనసేన పార్టీ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు..!
  • ప్రతి పేదవాడు స్వేచ్ఛగా, గొప్పగా బ్రతకాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం.!
  • బడుగు బలహీన వర్గాల పేదరిక నిర్మూలన జనసేన పార్టీ లక్ష్యం..!
  • రాజనగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో ‘జనం కోసం జనసేన’ ‘మహాపాదయాత్ర’కు అడుగడుగున జననీరాజనం.!
  • రాష్ట్రం మనది.. భవిత మనది.. రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ తరపున మన వంతు కృషిని నిబద్ధతతో చేద్దాం
  • పుణ్యక్షేత్రం గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుండి ఏకపక్షంగా పెద్ద ఎత్తున మద్దతు..!
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనం కోసం జనసేన, మహా పాదయాత్రలో మన ప్రియతమ నాయకులు రాజానగరం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి గ్రామ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి, పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నామని వారే చెప్పడం చూస్తుంటే ప్రజలు ఈ అధికార ప్రభుత్వంపై ఎంత విసుగు చెంది ఉన్నారో మనకి అర్ధం అవుతుంది. అడుగడుగున మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా సాగింది ఈ మహాపాదయాత్ర! ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్రం జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు, పుణ్యక్షేత్రం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.