పెద్ద కోటిపల్లి గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణి

పాలకొండ మండలం, పెద్ద కోటిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఉమా కాత్యాయని సహిత విశ్వేశ్వర స్వామి 54వ వార్షిక మహోత్సవాల సందర్భంగా మార్చి 1వ తారీఖున పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత త్రాగునీరు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, శానిటైజేషన్ మరియు మాస్కులు పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద కోటిపల్లి, ఎల్.ఎల్ పురం, భాసూరు, రాజపేట, అర్థలి, మరియు పథ్మపురం జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.