27 వ జిల్లా గా పులివెందులకు (భీంరావు)గా అంబేద్కర్ పేరు పెట్టగలరా…?

*కులాలను రెచ్చగొట్టేందుకే వైకాపా (కోనసీమ) డ్రామా…

*వైసిపి…. డోన్టు ప్లే ఛీప్ ట్రిక్స్.. దళిత జనసేన పార్టీ హెచ్చరిక..!

తిరుపతి: దళితులు జనసేన వైపు ఉన్నారన్న, కక్షతో అమలాపురం సాక్షిగా కోనసీమ స్క్రీన్ ప్లేను వైసిపి సక్సెస్ చేయడానికి ప్లాన్ చేసిందని… ఇదంతా జనరేషన్ మార్పు, సోషల్ మీడియా చక్కర్లతో.. జనం నిజాలను గ్రహిస్తున్నారని.. జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.. ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో జనసేన పార్టీ దళిత నాయకులు కుమార్, చైతన్య, పరమేష్, రమేష్, హరినాయక్ మరియు నగర అధ్యక్షుడు రాజారెడ్డిలతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు మొదట వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసినా.. చివరికి ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు.. సానుకూలంగానే వంగవీటి కాపు నాయకులు స్పందించారని.. అదేవిధంగా కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరును సూచిస్తే అగ్రవర్ణాలు సంతోషించారే గాని… ఇలా దాడులకు పాల్పడరని.. ఇది మొత్తం “సీఎం జగన్” జగన్నాటకం గా అభివర్ణించారు.. జగన్ కి సత్తా ఉంటే వైయస్సార్ తో పాటు జగన్ ల ఫోటో లను పక్కనపెట్టి .. అంబేద్కర్ ఫోటోతో ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు.. సినీ పవర్ స్టార్ తో ఫోటో తీసుకున్న (అన్యం సాయి) ఫోటోను మంత్రులు బొత్స, ధర్మానలు జనసేన పై బురదజల్లడానికి ప్రయత్నించడం.. తప్పని హెచ్చరించారు.. ప్యాకేజీ మంత్రి రోజాకి ఇదే చివరి మంత్రి పదవని ఇక ఇంటి వంటకు పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు..
నేటి ఫ్యాన్ పార్టీ పాలనలో.. ధర్నాలు, నిరసనలు చేస్తానంటే హౌస్ అరెస్టు లు తప్పనిసరి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైకాపాకు దాడుల డైరెక్షన్ ఇచ్చేది ప్రశాంత్ కిషోర్, సజ్జల రామకృష్ణారెడ్డి లే నన్నారు.. వైకాపా కు దమ్ముంటే కడప జిల్లా ఒకదానికి (భీమ్ రావు) అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని సవాల్ విసిరారు.