వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం వరకూ విస్తరిస్తున్నందున రాగల 24 గంటల్లో అల్ప పీడనం ఏర్పడి బలపడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం రాత్రి వెల్లడించింది. ఇది ఒడిశా మీదుగా పడమటి దిశగా కదిలే అవకాశాలు న్నాయని, దీనివల్ల ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.