కాణిపాకం వినాయకుడికి రూ.7 కోట్ల విరాళం అందజేసిన ఎన్‌ఆర్‌ఐ

చిత్తూరు: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ ఎన్‌ఆర్‌ఐ భారీ విరాళం ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.7 కోట్ల విరాళం అందజేశారు. శనివారం ఉదయం ఆలయ ఇఒ ఎ.వెంకటేష్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్రవాస భారతీయుడు చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఇవాళ రూ.7 కోట్లు ఇచ్చారని ఇఒ తెలిపారు. దాత, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా, విరాళం అందజేసిన ఎన్‌ఆర్‌ఐ తన పేరు చెప్పేందుకు ఇఒ నిరాకరించారు.