జనసేన రైతు భరోసా యాత్రకు చిన్నారి సాయం

• శ్రీ నాగబాబుకు కిడ్డీ బ్యాంక్ అందజేసిన ఎనిమిదేళ్ల బాలిక మజ్జి రోషిణి
వ్యవసాయంలో నష్టాల పాలై, ఆర్ధిక ఇబ్బందులతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా నింపి, తనవంతు ఆర్ధిక సాయం అందచేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చిన్నారులను సైతం ఆలోచింప చేస్తోంది. పవన్ కళ్యాణ్ రైతుల కోసం ఏదో చేస్తున్నారు.. దానికి అంతా తలోచేయి వేయాలన్న తలంపు కలిగిస్తోంది. విజయనగరం జిల్లాకు చెంది ఎనిమిదేళ్ల చిన్నారి మజ్జి రోషిణి తన కిడ్డీ బ్యాంకును తనవంతు సాయంగా రైతు భరోసా యాత్రకు ఇవ్వడమే అందుకు నిదర్శనం. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రెండో రోజు విజయనగరం జిల్లా వెళ్లిన శ్రీ నాగబాబుకి ఆ చిన్నారి తన కిడ్డీ బ్యాంకును అందచేసి ఆ మొత్తాన్ని “జనసేన కౌలు రైతు భరోసా” నిధిలో జమ చేయమని కోరింది. ఆ చిన్నారి చర్య అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.