సిఎం జగన్ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలి: వబ్బిన సన్యాసి నాయుడు

విజయనగరం, సిఎం జగన్ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అద్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు డిమాండ్ చేసారు. 40 వరకు సిబిఐ, ఈడి, అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ బెయిల్ ను రాష్ట్ర ప్రజలు రక్షణ కోసం రద్దు చేయాలని కాపు ఉద్యమ నేత వేల్పురి శ్రీనివాసరావు సిబిఐ డైరెక్టర్ కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారని సన్యాసి నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గముకు రక్షణ లేదని, జగన్ సోదరి షర్మిల, సునీతలు కూడా జగన్ పాలన రాక్షస పాలన అని వివేకా హంతకుడి వైఎస్సార్ పార్టీని ఓడించాలని వారు ప్రజలకు పిలునిచ్చిన విసయాన్ని ఆయన గుర్తుచేశారు. నిత్యం పనికిరాని లేఖలు రాసే, కాపులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ముద్రగడ, జోగయ్యలు కూడా రాష్ట్ర సంక్షేమం కోసం జగన్ ను అరెస్ట్ చేయాలని, కనీసం ఒక్కసారి లేఖలు రాయాలి అని సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు. నియంత సిఎంగా ఉంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలకు శిక్షలు అప్రోవరుగా మారిన దస్తగిరికి రక్షణ అసాధ్యం అని పేర్కొన్నారు. కావున చట్టం అందరికీ సమానం, అదే విధంగా అందరికి సమాన రక్షణ అనే రాజ్యాంగ సూత్రాన్ని పాటించాలని సన్యాసి నాయుడు గుర్తు చేశారు.