టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిస్తే రూ.3 కోట్లు.. విజేతలకు సిఎం స్టాలిన్‌ భారీ ఆఫర్‌!

చెన్నై : టోక్యో ఒలింపిక్స్‌-2021లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు రూ.3 కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సిఎం ఎంకె స్టాలిన్‌ వెల్లడించారు. సిల్వర్‌ పతక విజేతకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతకు రూ.కోటి ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించారు. స్టాలిన్‌ నిర్ణయంపై భారత ఆటగాళ్లందరూ సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ జరగనున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్‌ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.