ధోనీ తల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్‌గా

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం దేశంలో కొత్తగా దాదాపుగా 3 లక్షల మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి రాజకీయ నాయకులు, క్రీడాకారులను సైతం వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ధోనీ తల్లి దేవకి దేవి, తండ్రి పాన్‌సింగ్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం వీరు రాంచీలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముంబయిలోని వాంఖడే మైదానంలో బుధవారం ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.