కరోనా మొదటి డోసు టీకా వేయించుకున్న హీరో నాగార్జున

హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (cowin.gov.in) రిజిస్టర్‌ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని కోరారు.