వరుస శంకుస్థాపనలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం: 64వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం వెంకన్నపాలెం గ్రామంలో 19.87లక్షల రూపాయల జివిఎంసి నిధులతో, ఈతపాలెం గ్రామంలో 19.13లక్షల రూపాయల జివిఎంసి నిధులతో.. రోడ్లు, కాలువలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది… ఈ సందర్భంగా దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి బాధ్యత నాది.. మీకు ఇచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా పూర్తిస్థాయిలో మీకు సంపూర్ణంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు కార్పొరేటర్ దల్లి గోవింద్ కి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, జనసైనికులు జనసేన నాయకులు జె.సి, ఈ.ఈ, డి.ఈ సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొనడం జరిగింది.