రాజానగరం నియోజకవర్గంలో బత్తుల దంపతుల సుడిగాలి పర్యటన

రాజానగరం నియోజకవర్గం నలుమూలల బత్తుల దంపతులు సుడిగాలి పర్యటన చేస్తూ.. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, కొందరికి ఆర్థిక సహాయం అందించారు. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆయా గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి చెందిన మాగాపు పోతురాజు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పిన బత్తుల బలరామకృష్ణ, అడ్డాల శివ, మన్యం శ్రీను, అడ్డాల శ్రీను, పడాల అనీష్, గాదంశెట్టి వెంకన్న, మాగాపు నాగు, అడ్డాల దుర్గాప్రసాద్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన షేక్ ఇషా గారికి బస్సు ప్రమాదంలో వెన్నుపూసకు గాయం కాగా.. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ పరామర్శించి, వైద్య ఖర్చులు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం సీతానగరం మండలం, సింగవరం కాలనీకి చెందిన కుంచుముతి వెంకన్న కుమార్తె దురదృష్టవశాత్తు చనిపోగా వారి తల్లిదండ్రులను పరామర్శించి, వారి ఆర్థిక పరిస్థితులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ దృష్ట్యా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన కుంచే లక్ష్మీనారాయణ ఇటీవల నిర్యాణం చెందగా.. వారి కుటుంబ సభ్యులను బత్తుల బలరామకృష్ణ పరామర్శించి, మనోధైర్యం చెప్పారు.. అనంతరం సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన ఉందుర్తి రాజు ఇటీవల స్వర్గస్తులు కాగా..వారి కుటుంబ సభ్యురాలు మరియమ్మ ను పరామర్శించి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.. 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామానికి చెందిన వేలుపూరి చెల్లారావు ఇటీవల స్వర్గస్తులు కాగా… వారి కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యం చెప్పారు. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన.. అడ్డాల సుబ్బారావు భార్య అనిత పరమపదించగా, వారి కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఓదార్చి మనోధైర్యం చెప్పారు. సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన చాపల వెంకటేశులు ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కుటుంబ ఖర్చుల నిమిత్తం 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.. సీతానగరం మండలం, చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు పందుల వెంకన్న తల్లి ఇటీవల మృతి చెందగా వెంకన్న ను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, ధైర్యం చెచెప్పారు. సీతానగరం మండలం, కూనవరం గ్రామానికి చెందిన మాదారపు పెద్దవెంకటరావు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. సీతానగరం మండలం, ఇనుగంటివారిపేటలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందిన కుంచే అప్పారావు కుటుంబాన్ని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యం చెప్పారు. సీతానగరం మండలం, వంగలపూడి గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నేత చీకట్ల వీర్రాజు అస్వస్థకు గురికాగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామానికి చెందిన కర్రీ పుష్పవతి (పుల్లమ్మ) మృతిచెందగా వారి చిత్రపటానికి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతానగరం మండలం, సింగవరం కాలనీ వాసి మట్ట వెంకట్రావు కు ప్రమాదంలో చేయి విరగ్గా వారిని పరామర్శించి, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని డాక్టర్లు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బత్తుల వెంకటలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ, మండల, ఆయా గ్రామాల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు బత్తుల దంపతులతో పాటు పరామర్శించిన వారిలో ఉన్నారు.