కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అనుమ‌తుల‌పై.. హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. లాక్‌ డౌన్‌ తర్వాత రాను రాను కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టినప్పటికీ… కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతోంది. ఈ వైరస్‌ నుంచి బ్రిటన్‌ నుంచి ఇండియా ఎక్స్‌పోర్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్. వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్‌ విరాజిల్లుతోందన్నారు. హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు.