ఢిల్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఎనిమిది మంది మృతి..

ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా విషావదనం నిండింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.