పవన్ కు మద్దతుగా వైసీపీ ఎంపీ రఘురామ.. జగన్ పై విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రోడ్ల దుస్థితి పై స్పందిస్తున్న తీరును ఆహ్వానిస్తున్నానని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లలో కాకుండా రోడ్లపై తిరగాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు ప్రజా సమస్యల గురించి మీ దగ్గర చెప్పడం లేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఒక్క దేవాలయాలకే కరోనా నిబంధనలా అని నిలదీశారు. కరోనా సాకు చూపి గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయని… జగన్ ప్రభుత్వం పై వైసిపి నాయకులు పై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.