అక్టోబర్ 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..అధికారిక ప్రకటన!

కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. దీనితో చాలా వరకు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. కాగా మరి కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పండగలను టార్గెట్ పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

దసరాకి మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అఖండ, విశాల్ ఎనిమి, కొండపొలం, మహాసముద్రం వంటి సినిమాలు దసరా కి రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా ఆ రేస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేరింది. ఈ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ కాబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.