గోపాలపురం నియోజకవర్గంలో దగ్గుబాటి పురంధేశ్వరి రోడ్ షో

రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్ధి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం గోపాలపురం నియోజకవర్గంలోని రోడ్ షో జరిపారు. బుధవారం ఉదయం 6:30కి చెరుకుమిల్లి గ్రామంలో ప్రారంభం అయిన ఈ యాత్ర గోపాలపురం, దేవరపల్లి మండలాల మీదుగా రాత్రి 10:00 గంటలకు యర్నగూడెంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్ధి పురంధేశ్వరితో, మాజీ జెడ్ పి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, గోపాలపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు మరియు మూడు పార్టీల జిల్లా నాయకులు, నాలుగు మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోడ్ షోని దిగ్విజయం చేసారు.