ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్నీ అందుకున్న డేవిడ్‌ బోరో

2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటెన్‌ బోరో అందుకున్నారు. వర్చువల్‌ మాధ్యమంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ బహుమతిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ.. జీవవైవిధ్యాన్ని కాపాడటానికి బోరో చేస్తున్న సేవలను ప్రశంసించారు. కాగా శాంతి, నిరాయుధీకరణ, ప్రకృతి పరిరక్షణ-అభివృద్ధి కోసం చేసిన కృషికిగానూ బోరో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.