జనంతో జనసేన కార్యక్రమం 8వ రోజు

  • జనంతో జనసేన 8వ రోజు ఆముదాలవలస నియోజకవర్గం

ఆముదాలవలస నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అడుగుజాడల్లో, ఆముదాలవలస నియోజకవర్గంలో నారాయణపురం గ్రామంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగముగా 8వ రోజు, జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు. విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాసమస్యలు మరియు గ్రామం యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దానితోపాటుగా జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద చేస్తున్న పోరాటాల గురించి ప్రజలకు అర్ధమయ్యే విదంగా వివరించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో సేపేన.రమేష్, సంతోష్ నాయుడు, అనిల్, కోమల్, మోహన్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.