ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందజేత

జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే క్రిష్టపల్లి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ ప్రమాదసాత్తు మరణించటంతో ఆ కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, పార్వతీపురం జనసైనికులు మరియు నాయకులతో కలసి, కుటుంబాన్ని పరామర్శించి వారికి 10,000 రూపాయిలు సహాయం అందించడం జరిగింది. ప్రసాద్ తల్లిదండ్రులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.