ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‎తో మ్యాచ్‎లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్‌-13లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బౌలర్ల ధాటికి తడబడిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఇయాన్, రాహుల్ త్రిపాటి విరుచుకుపడ్డారు. చెమటలు పట్టించారు. కీలక సమయంలో వీరిద్దరి వికెట్లు పడిపోవంటంతో ఢిల్లీకి విజయం సాధ్యమైంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా దీనికి తగినట్టుగానే 228 పరుగులతో అదరగొట్టింది. అయినా కోల్‌కతా భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కారణంగా ఏమైనా జరగొచ్చని అనిపించింది. కానీ పక్కా వ్యూహం ప్రకారం బంతులు వేసిన ఢిల్లీ బౌలర్లు కేకేఆర్‌ను బేజారెత్తించారు. డెత్‌ ఓవర్లలో త్రిపాఠి, మోర్గాన్‌ పోరాటం విజయంపై ఆశలు రేకెత్తించినా చివరికి ఢిల్లీదే పైచేయి అయ్యింది. డీసీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌, పృథ్వీ షా అర్ధసెంచరీలతో అదరగొట్టారు.