రంగా పోరాట స్ఫూర్తితో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి: జనసేన డిమాండ్

ప్రకాశం: విఎంఆర్ ప్రజాసేవ సంస్థ నాయకులు మన్నేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కంభం మండలం కందులపురం గ్రామం లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వంగవీటి మోహన రంగా చనిపోయి 34 సంవత్సారాలు అయిన సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తినీ ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, ఎన్ వి సురేష్, కంభం మండలం అద్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ మరియు మాద రమణ,ఎం వెంకటాద్రి, ఎం నరసింహ, సి రంగస్వామి, ఎన్ వెంకటేశ్వర్లు, కె భాస్కర్, ఎస్ వెంకటేశ్వర్లు తదితులు పాల్గొన్నారు.