పాత చట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు: మోదీ

పాత చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశం అభివృద్ధి కోసం సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు మంగళవారం నిర్వహించిన ఆగ్రా మెట్రో రైల్‌ ప్రాజెక్టు వర్చువల్‌ ప్రారంభ కార్యక్రమంలో మోదీ వెల్లడించారు.

పాత చట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు. అభివృద్ధి కావాలంటే సంస్కరణలు అత్యావశ్యకం. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా… సంస్కరణలు కచ్చితం. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం.”అందుకే మా ప్రభుత్వం పూర్తిగా సంస్కరణలను ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలంలో మా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. అందుకు తాజాగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం’ అని మోదీ వెల్లడించారు. అదేవిధంగా దేశంలో రూ.100 లక్షల కోట్లతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం మొదలైనట్లు మోదీ పేర్కొన్నారు.