ప్రధాని మోదీ లేఖపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై అంటూ ఇటీవల చేసిన ప్రకటన ఎంతోమంది ధోని అభిమానులను ఆవేదనకు గురి చేసిoది. ఈ రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ధోనీకి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఓ లేఖ రాశారు.

‘టీమిండియాకు ధోనీ అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ధోనీని అభినందించిన ప్రధాని మోదీ.. క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా ధోనీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అని ప్రశంసలతో ముంచెత్తారు. ధోనీ భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండాలి’ అని ఆశిస్తున్నట్టు ధోనికి రాసిన లేఖలో ప్రధాని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు.

ప్రధాని మోదీ  రాసిన లేఖకు ధోనీ స్పందిస్తూ.. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే అని అభిప్రాయపడ్డారు. తాము పడిన కష్టం, చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు దక్కాలనే వారు కోరుకునేది. అలాగే తనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు’ ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ధోని రిప్లై ఇచ్చాడు.