నవతన్ పై క్రమశిక్షణ వేటు
హైదరాబాద్, నవతన్ అనే వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు వేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తాళ్లూరి రామ్ నవతన్ అనే వ్యక్తిని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది. ఈ క్షణం నుండి నవతన్ అనే వ్యక్తికి జనసేన పార్టీతో, జనసేన పార్టీ కార్యక్రమాలతో ఏ విధమైన సంబంధం ఉండదని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు వేమూరి శంకర్ గౌడ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/N_._Shankar_Goud_.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-15-at-22.40.53-723x1024.jpeg)