ఏపీ అభివృద్ధి గురించి చర్చించా.. పవన్

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. అనంతరం దిల్లీలో పవన్‌ మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వారం మేరకే ఢిల్లీకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. నడ్డాతో భేటీలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని పవన్‌ పునరుద్ఘాటించారు. పోలవరంపైనా స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల వ్యవహారంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వివరించారు. తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తామన్నారు. దీనిపై ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని పవన్‌ చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామన్నారు.