రూ.100 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటి ప్రారంభమై నేటికి సరిగ్గా వందేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్ పద్దతిలో నిర్వహించిన స్వర్ణోత్స కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్నో యూనివర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేక పోస్టల్ స్టాంపును.. అలాగే ఈ రూ.100 నాణేన్ని ప్రధాని తన చేతుమీదుగా విడుదల చేశారు.