గండేపల్లి గ్రామంలో జనసేన వనరక్షణ

  • జనం కోసం జనసేన 583వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 583వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా శుక్రవారం ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 12,100 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 584వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, గండేపల్లి నుండి గ్రామ అధ్యక్షులు నాళం వెంకన్న బాబు, కర్రి సోము, కట్టుమోతు సత్యనారాయణ, దెయ్యాల రమేష్, ఆళ్ల మణికంఠ, ముప్పిడి మనోజ్, అబ్బిరెడ్డి ప్రసాద్, గరికపాటి ఉమేష్, బుర్ర వీరేంద్ర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.