క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, దేవీపట్నం మండల ఆర్ అండ్ ఆర్ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కట్టమూరు వీరబాబు, అయినవిల్లి భద్రం చేతుల మీదగా ముగ్గురికి క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందజేయడం జరిగింది. మరియు రంపచోడవరం డివిజన్ గ్రూపులో మాకు జెండాలు కావాలని మెసేజ్ పెట్టగా అది చూసి జనసేన జెండాలు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుర్రం వీరబాబు, దొర కోసు, సుబ్బారావు దొర, సవలం మహేష్ తదితరులు పాల్గొన్నారు.