దెందులూరు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం
దెందులూరు నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాల ప్రధానం జరిగింది.. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించిన గొప్ప పార్టీ జనసేన. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారి శ్రేయస్సు గురించి ఆలోచించిన గొప్ప మనసు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా తమ పార్టీ కార్యకర్తలకు 5 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించడం కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యపడిన విషయం. తమ పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించనపుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేయగలరు. అటువంటి నాయకుని అధ్యక్షతన జనసేన పార్టీ లో పనిచేయడం నిజంగా గర్వకారణమని సాయి శరత్ అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-11.00.10-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-11.00.11-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-11.00.11-AM-1.jpeg)