కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ సిటి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసైనికుల క్రియాశీలక సభ్యత్వాలు చేపట్టడం జరిగినది. పవన్ కళ్యాణ్ గారి సొంత వితరణతో.. చొరవతో సభ్యులకి భీమా సదుపాయం కల్పించడం కూడా జరిగినది.

జనసేన పార్టీ అధిష్టానం నిర్దేశించిన విధంగా శనివారం కాకినాడ సిటిలో ముత్తా శశిధర్ సూచనలపై జనసైనికుల క్రియాశీలక సభ్యుల కిట్లను ఉదయం కాకినాడ పార్టీ ఆఫీసు ఆవరణలో, సాయంత్రం జగన్నాధపురం చర్చ్ స్క్వేరు వద్ద పంపిణీ చేస్తూ.. సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లకి చిరుసత్కారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ తరపున తనవంతు బాధ్యతగా కార్యకర్తల సంక్ష్యేమం కోసం భీమా పధకాన్ని అందచేయడం చాలా సంతోషం కలిగిస్తొందని.. దీనితో తమ బాధ్యత రెట్టింపు అయ్యిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.