సనత్ నగర్లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ మండపాక కావ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 50 వేల భద్రత, 5 లక్షల రూపాయల జీవిత భీమా పథకాన్ని తీసుకొచ్చినట్లు సనత్ నగర్ జనసేన ఇన్చార్జ్ ఎం.కావ్య ముదిరాజ్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే సభ్యత్వాలు తీసుకున్న వారికి ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని ఎం.కావ్య ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.