జనసేన పార్టి తరపున భక్తులకు మజ్జిగ పంపిణి

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ ఛార్జ్ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దర్శనముకు వచ్చిన భక్తులకు 450 లీటర్ల మజ్జిగ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు జన్ను ప్రవీణ్, వస్కులా నిఖిల్ చోప్రా, కన్నెబోయిన రాజు, ఇల్లందుల రాజు, యాదవ్, నవీన్, రోహన్, రామ కృష్ణ, సంతోష్, మనోజ్, రాజేష్, రవి తేజ, ఘాని, అఖిల్, బంటి, వినయ్ కార్తీక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.