అనంతపురం జనసేనలోకి పలువురి చేరిక

*సాదరంగా ఆహ్వానించిన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు
*జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ నాయకత్వం బలపరుస్తాం

అనంతపురం, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీ పటిష్టత కోసం విశేష కృషి చేస్తున్న జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ నాయకత్వాన్ని బలపరుస్తామని నూతనంగా పార్టీలోకి చేరిన యువత పేర్కొన్నారు. మంగళవారం సప్తగిరి సర్కిల్ లో జనసేన పార్టీ కార్యాలయంలో నగరంలో పలు డివిజన్లకు చెందిన యువత నగర అధ్యక్షులు పొదిలి బాబురావు ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. యువత నేడు జనసేన పార్టీలోకి చేరారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో హరి, లోకేష్, ప్రతాప్, రాజేష్, రంజిత్ కుమార్, శివ, రఘు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.