జనసేన ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు ఉచిత మజ్జిగ పంపిణీ

మాడుగుల నియోజకవర్గం: కె.కోటపాడు మండలంలో 32 పంచాయతీలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని కె. కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు తెలిపారు. దీనిలో భాగంగా శనివారం చౌడువాడ పంచాయతీలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ చాలా మంచి పని చేశారని మంచిగా కోనియాడారు. ఈ కార్యక్రమంలో చౌడువాడ జనసేన నాయకులు నాగులపల్లిమహేష్, గాడి అంజి, కోమారఅర్జున్రావు, గంగుమల్ల అంజి, పచ్చికోర పవన్ కుమార్, కుంచా నారిబాబు, మరియు చౌడువాడ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి కుంచా అంజిబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.